
ధూత సిరీస్ లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు చైతూ. ఒక జర్నలిస్ట్ కథానాయికుడిగా తన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. ప్రతిదీ వార్త పత్రిక ద్వారా కనెక్ట్ అయి సన్నివేశారు రన్ అవుతుంటాయి. మొదట్లో దీనిని గా తీయాలనుకున్నారని వినిపించాయి. ఓటీటీలో అతీంద్రియ శక్తుల నేపథ్యంతో ఒక తీయాలనుకున్నారట డైరెక్టర్ విక్రమ్. కానీ చైతూకు హారర్ స్టోరీ కంటే ధూత కథ నచ్చిందని గతంలో తెలిపారు డైరెక్టర్ విక్రమ్.
2014లో దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన మనం సూపర్ హిట్ అయ్యింది. అదే సమయంలో చైతూతో ఓ హారర్ చేయాలనుకున్నారట. కానీ చైతూ హారర్ కంటే ధూత చేసేందుకు ఆసక్తి చూపించారని వెల్లడించారు. ధూత సిరీస్ కు నవీన్ నూలి ఎడిటింగ్, మికోలాజ్ సైగులా టోగ్రఫీ అందించారు. డిసెంబర్ 1, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాకుండా.. ప్రస్తుతం చైతూ తండెల్ చిత్రంలో నటిస్తున్నారు. చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. మత్స్యకారుల జీవితం చుట్టూ తిరిగే నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది.