తెలుగులో ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు సమకూర్చారు. అయితే ఎట్టకేలకు శ్రీరామనవమికి కొన్ని రోజులు ముందు అనగా ఏప్రిల్ 2వ తేదిన రామయాణం సినిమా ముంబైలోని ఓ స్టూడియోలో షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. భారీ జన సమూహం నేపథ్యంలో షూట్ చేస్తోన్న సీన్స్ కొన్ని రోజులు పాటు పిక్చరైజ్ చేయనున్నరారట. దేశంలోని దాదాపు 12 భాషల్లో మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను శ్రీరామనవమి రోజున ప్రకటించనున్నారు. ఏది ఏమైనా అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాల రాముడు కొలువైన ఈ శుభ సందర్భంలో ఈ సినిమా తెరకెక్కనుండటం శుభ పరిణామం.ఈ సినిమాను తెలుగు వాళ్లైన అల్లు అరవింద్, మధు మంతెనతో పాటు పలువురు బాలీవుడ్ నిర్మాతలు నిర్మాణ భాగస్వాములుగా రామాయణం సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.
రణ్బీర్ కపూర్ విషయానికొస్తే.. గతేడాది చివర్లో 'యానిమల్' మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అటు యశ్ కూడా కేజీఎఫ్ సిరీస్తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. ఇంకోవైపు సాయి పల్లవి .. నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది. మొత్తంగా ముగ్గురు యూనిక్ పర్సనాలిటీస్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.