యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ కూడా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటి వరకు దేవర సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా పైన ఒక అప్డేట్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే ఈ సినిమా నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.


దేవర నిర్మాతలతో తాను కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావడం తనకు చాలా ఆనందంగా ఉందంటూ తన సోషల్ మీడియా ద్వారా కరెంట్ జోహార్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.ఈ మేరకు గొప్ప వినోదం యొక్క హరికేన్ చాలా దగ్గరలోనే ఉంది అంటూ.. దేవర సినిమాలో తనని భాగం చేసుకున్నందుకు ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు అని కూడా తెలియజేశారు. భారతీయ సినీ పరిశ్రమలో తదుపరి అతిపెద్ద సినిమా ఆయన దేవర నార్త్ థియేటర్ డిస్ట్రిబ్యూటర్ హక్కులను మా భాగస్వామ్యం అయ్యిందంటూ ప్రకటించారు.


ఈ విషయం చెప్పడానికి తమకి చాలా గర్వంగా ఉందని కూడా పోస్ట్ పెడుతూ తెలియజేశారు కరణ్ జోహార్.. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కరణ్ జోహార్ దేవరతో చేతులు కలుపుతున్నాడు అంటే కచ్చితంగా ఈ సినిమా బాలీవుడ్లో బాయ్ కాట్ తప్పదేమో అంటూ చాలా భయపడుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కూడా ఇందులో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: