బుల్లితెర యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్యామల తన పోస్టుల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. యాంకర్ శ్యామల తాజాగా తన పోస్ట్ లో కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ సరి కాదని ఆయన నిజాయితీతో పని చేసిన వ్యక్తి అని నిష్కల్మషమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రజల పక్షాల నిలబడిన గొప్ప నేతలైన వైఎస్సార్, జగన్ లతో ఆయన పని చేశారని శ్యామల చెప్పుకొచ్చారు.
 
ఈ వ్యక్తుల సిద్ధాంతాలను కృష్ణమోహన్ రెడ్డి హృదయపూర్వకంగా అనుసరించారని ప్రజలకు సేవ చేయాలనే ధృఢ నిశ్చయంతో జీవించారని ఆమె కామెంట్లు చేశారు. కృష్ణ మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత విశ్వసనీయమైందో ఆయన విధేయత ఎంత నిజమైందో అందరికీ తెలుసని ఆమె కామెంట్లు చేశారు. కృష్ణ మోహన్ రెడ్డి త్వరలోనే విడుదలవుతారని ఆమె చెప్పుకొచ్చారు.
 
కృష్ణమోహన్ రెడ్డి నిర్దోషిత్వం ప్రజల ముందుకు స్పష్టంగా రాబోతుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉందని శ్యామల చెప్పుకొచ్చారు. నిజాయితీ, విలువలతో సేవ చేసే వ్యక్తులు సమజానికి ఎంతో అవసరమని శ్యామల పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఎంతోమంది అరెస్ట్ కాగా శ్యామల మాత్రం కేవలం కృష్ణ మోహన్ రెడ్డికి అనుకూలంగా పోస్ట్ పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
శ్యామల పరోక్షంగా వైసీపీకి తీరని నష్టం చేస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. యాంకర్ శ్యామల ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విమర్శల పాలు అవుతున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. శ్యామల గారు భవిష్యత్తులో సైతం విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో శ్యామల తీరు మారుతుందేమో చూడాల్సి ఉంది. శ్యామల విషయంలో వైసీపీ అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: