
ఇప్పటికే తన తదుపరి సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుందని మంచు విష్ణు వెల్లడించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. విష్ణు తదుపరి చిత్రం ప్రముఖ నటుడు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రభుదేవాకు దర్శకత్వంలోనూ పట్టుంది. గతంలో తెలుగులో `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `పౌర్ణమి`, `శంకర్ దాదా జిందాబాద్` వంటి చిత్రాలకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
అలాగే అటు తమిళ్, హిందీ భాషల్లోనూ కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు. చివరిగా 2021లో సల్మాన్ ఖాన్ తో `రాధే` సినిమాను తెరకెక్కించిన ప్రభుదేవా.. లాంగ్ గ్యాప్ అనంతరం మరోసారి మంచు విష్ణుతో చేయబోయే సినిమా కోసం మెగా ఫోన్ పట్టబోతున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించేబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు