పురాణ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్‌ ప్లాన్ చేశారు. కానీ వీరి కాంబో ప్రాజెక్ట్‌ చర్చల దశలోనే ఆగిపోయింది. ఆ తర్వాత అదే సబ్జెక్టుతో ఎన్టీఆర్ వద్దకు వెళ్ళగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ప్రశాంత్ నీల్ తో `డ్రాగన్`, కొరటాల శివతో `దేవర 2` చిత్రాలు లైన్ లో ఉండడం వల్ల ఎన్టీఆర్ ఇప్పట్లో డేట్స్ ఇచ్చే అవకాసం లేదు.


అయితే ఈ గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించేందుకు శ్రీకారం చుట్టారు. ఇంతవరకు అధికారిక ప్రకటన రానప్పటికీ.. సైలెంట్ గా ఈ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వెంకీ కెరీర్ లో 77వ చిత్రిమిది. ప్రీ ప్రొడక్షన్ వ‌ర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మరి కొద్ది రోజుల్లో వెంకీ-త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్ల‌బోతుంది. వ‌చ్చే ఏడాది సమ్మ‌ర్ లో రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు.


అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. వెంకీతో చేయ‌బోయే చిత్రానికి డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ `వెంకట రమణ` అనే క్రేజీ టైటిట్ ను లాక్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ టైటిల్ కు `కేర్ ఆఫ్ ఆనంద నిలయం` అనేది ట్యాగ్ అని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: