
దర్శకుడు శంకర్ కొన్ని సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరో గా భారతీయుడు అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో కమల్ హాసన్ తండ్రి , కొడుకు పాత్రలలో నటించాడు. దర్శకుడు శంకర్ మొదట ఈ సినిమాలో తండ్రి పాత్రలో టాలీవుడ్ హీరో రాజశేఖర్ ను , కొడుకు పాత్రలో విక్టరీ వెంకటేష్ ను అనుకున్నాడట. కానీ ఆ తర్వాత అది కుదరకపోవడంతో కమల్ హాసన్ ను ఈ మూవీలో హీరోగా ఎంచుకొని రెండు పాత్రలను కూడా ఆయనతోనే చేయించాడట. దర్శకుడు శంకర్ కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ హీరో గా ఒకే ఒక్కడు అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని కూడా మొదట శంకర్ , వెంకటేష్ తో చేయాలి అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదట. అలా వెంకటేష్ తో రెండు సార్లు శంకర్ సినిమా చేద్దాము అనుకున్న కూడా అది కొన్ని కారణాల వల్ల కుదరలేదట. ఈ వార్త బయటకు రావడంతో చాలా మంది వెంకటేష్ గనుక ఆ రెండు సినిమాల్లో హీరో గా నటించి ఉండి ఉంటే ఆయనకు ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ వచ్చేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా వెంకటేష్ ప్రస్తుతం కూడా సూపర్ సాలిడ్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.