
సావిత్రి తారగా తెగిపోయిన తర్వాత సినిమాలు తగ్గిపోయాయి. ఏదో సినిమాలో తల్లి పాత్ర చేస్తున్నారు. అందరికీ మామూలుగా ఇంటి నుంచి భోజనం వస్తుంది. మాకు వచ్చాయి.. ఆమెకు ఇంటి నుంచి తీసుకొచ్చేవాళ్లు లేరు. సావిత్రి దూరంగా ఒక్కట్టే కూర్చొని ఉంది. నేను వెళ్లి రామ్మా.. భోజనం చేద్దాం అన్నా. ‘వద్దు అన్నయ్య అంది’. నువ్వు వస్తే కానీ నేను తినను అన్నాను. అప్పుడు కళ్లల్లో నీరు పెట్టుకుని వచ్చి, భోజనం చేసింది’. ‘‘సావిత్రి నా సినిమాలో ఉంటే చాలు’ అనుకున్న రోజులవి.అనంతరం ఆ స్థాయి నుంచి తగ్గగానే ప్రొడక్షన్ బాయ్స్ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆర్టిస్టుల జీవితాల్లో ఇది విషాదకరమైంది. సావిత్రికి ఉన్న ఆస్తులు ఇప్పుడు వందల కోట్లు విలువ చేస్తాయి. అలాంటిది ఆమె ఓ గ్యారేజీలో తన చివరి క్షణాల్ని గడిపారు. ఒకరకంగా సావిత్రి జీవితం అందరికీ గుణపాఠం. ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆమె వల్ల ఏ రోజూ, ఎవరూ ఇబ్బంది పడలేదు. చిన్నవారిని కూడా గౌరవించి మాట్లాడేది. అలాంటి అమ్మాయికి అలా జరిగింది. సావిత్రి లాంటి నటి పుట్టాలంటే ఓ శతాబ్దం పడుతుంది’ అని గుమ్మడి గుర్తుచేసుకున్నారు.