ప్రస్తుతం సోషల్ మీడియా అంతా హీట్‌ అయ్యే స్థాయిలో, సినీ ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మనందరికీ తెలిసిందే, ‘పుష్ప’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ‘పుష్ప’ సక్సెస్ తర్వాత ఆయన క్రేజ్, స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ విపరీతంగా పెరిగాయి. అల్లు అర్జున్ సినిమాలపై ఇప్పుడు ప్రేక్షకుల్లో వేరే స్థాయి అంచనాలు, వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం చేయబోతున్నారని వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్‌లో కావాల్సిన రేంజ్ లేదని భావించి, ఆ సినిమాను క్యాన్సిల్ చేసి, బదులుగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అట్లీ సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో రిలీజ్ అవుతున్న కొద్దీ అభిమానుల్లో హంగామా మొదలవుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఒక్కో వార్త బయటకొచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేగం చూడగానే, సినిమా ఎంత హైప్‌తో రూపొందుతోందో అర్థమవుతుంది.


ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒకటి కాదు, ఏకంగా మూడు వేరువేరు షేడ్స్‌లో కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో ఐదు మంది టాప్ హీరోయిన్‌లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని, వీరి ప్రతి పాత్ర కూడా స్పెషల్‌గా ఉండబోతుందన్న వార్త అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇంకా అంతటితో ఆగకుండా, టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి ఏకంగా పది మంది సూపర్‌స్టార్స్ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ పోషించనున్నారని  సోషల్ మీడియాలో విపరీతంగా కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కాంబినేషన్ వల్ల సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.



ఇదే సమయంలో, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ, గుప్పెడంత సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాజ్ ఓ స్పెషల్ పాత్రలో నటించబోతున్నారని వచ్చిన వార్త పెద్ద చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుండటమే కాకుండా, నెట్టింట పెద్ద కాంట్రవర్సీ కూడా మొదలైంది. జ్యోతిరాజ్ గతంలో కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు అట్లీ ఈ పాత్ర కోసం ఆమెను ఎందుకు ఎంచుకున్నాడని..? ఈ నిర్ణయం అవసరమా అని..? అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.



"ఈ సినిమాకి అలాంటి కాంట్రవర్షియల్ ఇమేజ్ ఉన్న హీరోయిన్‌ను ఎందుకు తీసుకున్నారు?" అంటూ బన్నీ అభిమానులు ట్వీట్స్, పోస్టుల రూపంలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మీద నెట్టింట పెద్ద చర్చ నడుస్తుండటమే కాకుండా, సినిమా మీద హైప్ మరింత పెరిగిపోయింది. మొత్తానికి, అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా ప్రతి చిన్న అప్డేట్‌కే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: