ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేర చరిత్ర కలిగిన కథలను తెరకెక్కించటం అలవాటుగా మారింది. ఆ విధంగానే ఇప్పుడు ఎంతో సంచలనం రేపిన డేగల శీను హత్యా చరిత్రను కథనం రూపంలో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ కథపై తెలుగు తమ్ముళ్లు ఓ చూపు చూస్తున్నారని అంటున్నారు. అలాగే బాబు గారు సైతం ఈ మూవీపై ఓ కంట కనిపెడుతున్నారని అంటున్నారు.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ఆర్.ఎఫ్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అమర్నాథ్ మండూరి దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం అయిన డేగల శీను అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన విషయం తెలిసిందే. దర్శక నిర్మాత అమర్నాథ్ మండూరి ఈ సినిమాని పకడ్భంధీగా తెరకెక్కిస్తున్నారు. తను గుంటూరు లోకల్ ఛానెల్లో ఇరవై సంవ్సతరాలకు పైగా వర్క్ చేస్తున్న సమయంలో గుంటూరులో జరిగిన ఓ యదార్థ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.
ఇక ఈ కధకి కొన్ని కల్పితాలు జోడించి డేగల శ్రీను సినిమా చేస్తున్నారు. యూత్ ఈగో సమస్యలు 50 హత్యలకు ఎలా దారి తీసిందనేదే ఈ సినిమా కథ. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ని చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో కొన్ని పార్టీలకి సంబంధించిన ఆనాటి కీలక సమాచారాన్ని బయటకు చెప్పనున్నారు. ఈ మూవీకి సంబంధించిన వివరాలను ఇప్పటికే కొంతమంది బాబు వద్దకు తీసుకువచ్చారు. దీంతో డేగల శీను మూవీపై కొంత మంది ఓ కంట కనిపెడుతూనే ఉన్నారని అంటున్నారు.
త్వరలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. గతంలో వర్మ సైతం ఈ మూవీని తెరకెక్కించాలని చూశారు. కానీ కొన్ని కారణాలతో అది చిత్రీకరణకి నోచుకోలేదు. ఇప్పడు డేగల శీను కథని అమర్ నాధ్ ముందుకు తీసుకువచ్చారు. డేగల శీను సినిమా ఎప్పుడైతే అనౌన్స్ మెంట్ అయిందో…అప్పటి నుండి గుంటూరు, విజయవాడ ప్రాంతంలో కాస్త ఆసక్తి నెలకొందని అంటున్నారు.