రజినీకాంత్ రోబోకు కొనసాగింపుగా వచ్చిన 2పాయింట్ 0 సినిమా ఇండియాతో పాటు అనేక దేశాల్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అనుకున్న ఇధంగా సినిమా విజయం సాధించలేకపోవడం విశేషం. సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నా 3డి సినిమా కావడంతో చాలా చోట్ల అలాంటి స్క్రీన్స్ లేకపోవడంతో సినిమా అనుకున్న విధంగా విజయం సాధించలేదు.
అయితే, ఈ సినిమా నిన్నటి రోజున చైనాలో రిలీజ్ అయ్యింది. దాదాపు 48000 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. మొదటిరోజు భారీగా వసూళ్లు వస్తాయని అనుకున్నారు. ఒక ఇండియన్ సినిమా అందులోను ఒక తమిళ్ సినిమాకు అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ లభించింది. దాదాపుగా 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
అంటే దాదాపు రూ. 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి. టాక్ కూడా బాగున్నట్టుగా రావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నది. ఈ సినిమా కనీసం అక్కడ 200 నుంచి 300 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉన్నది. చివరి వరకు సినిమా బాగుందని అంటున్నా.. చివర్లో పక్షి రాజాను చంపినా విధానం నెగెటివ్ గా మారిందని రివ్యూలు వస్తున్నాయి.
ఈ రివ్యూలను పక్కన పెట్టి చిట్టి చైనా ఎలా రాణిస్తుందో చూడాలి. ఫస్ట్ డే మంచి వసూళ్లు వచ్చాయి. ఈరోజు రేపు హాలిడేస్ కావడంతో సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. ఈరోజు రేపు వచ్చే వసూళ్లను బట్టి సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. మరి ఈ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. అనుకున్నట్టుగా భారీస్థాయిలో వసూళ్లు సాధిస్తే మరిన్ని సినిమాలు చైనాలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.