పుట్టా సుధాకర్ యాదవ్.. కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి. అంతే కాదు..ఆయన టీటీడీ తాజా మాజీ ఛైర్మన్‌ కూడా. అంతేనా.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కూడా. 


ఐతే.. పుట్టాసుధాకర్ యాదవ్ కుమారుడు మహేశ్ యాదవ్ స్థానిక యాదవ నాయకులపై బూతు పురాణం లంకించుకున్నాడంటూ వాట్సప్‌లో ఓ ఆడియో టేప్ వైరల్ అవుతోంది. బ్రహ్మంగారి మఠం మండలంలొ ఇటీవల రత్నకుమార్ కుటుంబం వైసీపీలో చేరింది. 


అంతకు ముందు రత్నకుమార్ పుట్టా సుధాకర్ యాదవ్ వర్గంలో ఉండేవారు. ఆయన టీడీపీ మండల ఇన్ చార్జిగా ఉన్నాడు. మూడు రొజుల క్రితమే రత్నకుమార్ కుటుంబం వైసీపీలో చేరింది. దీంతో పుట్టా కుమారుడు మహేశ్ యాదవ్ వారికి ఫోన్ చేసి బూతులు తిట్టినట్టు ఆడియోలో ఉంది. 


ఐదేళ్లు పనులు చేయించుకుని పార్టీ మారతారా అంటూ ఫోన్ లొనే బూతు పురాణం వినిపించాడు.. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చేది టిడిపినే.. అధికారంలోకి రాగానే మీ సంగతి చూస్తామంటూ బెదిరించాడు మహేశ్ యాదవ్.. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: