దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావటానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్న నేపథ్యంలో రైతులు బీభత్సమైన కష్టాలు పడుతున్న సందర్భంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రలో రైతులకు భరోసా ఇవ్వటం జరిగింది. ఉచితంగా కరెంటు ఏడు గంటల పాటు అధికారంలోకి వస్తే ఇస్తాను అని మాట ఇచ్చి...అధికారంలోకి వచ్చి రైతులను వైయస్ ఎంతగానో ఆదుకోవడం జరిగింది. వైయస్ పరిపాలన చేసినంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులంతా చాలా సుభిక్షంగా బతకటం జరిగింది.
అయితే అనూహ్యంగా వైయస్ మరణించటంతో రాష్ట్రం రెండుగా విడిపోయిన తరుణంలో మిగిలి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావటానికి అదే రైతులను ఆధారం చేసుకుని 'రైతు రుణమాఫీ' అని అసాధారణ అమలు చేయలేని హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినా చంద్రబాబు రైతుల హామీలను నెరవేర్చకుండా మాట తప్పడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్... రైతులను ఎంతో ప్రేమించిన తన తండ్రి జయంతిని ‘రైతుల దినోత్సవం’ గా ఇటీవల ప్రకటించడం మనకందరికీ తెలిసిందే.
అదే విధంగా అధికారంలోకి రావటం రావటమే రైతులకు వరాల జల్లు కురిపించే విధంగా సంక్షేమ పథకాలు ప్రస్తుతం వైయస్ జగన్ అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి చోటా రైతు భరోసా కేంద్రాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా అప్పట్లో తన తండ్రి ముఖ్యమంత్రిగా ఎన్నిక అవ్వటానికి కారణమైన రైతులపై వైయస్ చూపించిన ప్రేమ వైయస్ జగన్ చూపిస్తున్నారని రైతులు తాజాగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి కామెంట్లు చేస్తున్నారు.