మొదటి రకం కరోనాతో జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు, ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఆ విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా భయం నుంచి జనం బయటకు వస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతుండడడంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉండగా, ఇప్పుడు రెండో రకం కరోనా భయం వెంటాడుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారి ద్వారా మన దేశంలోకి కొత్త రకం వైరస్ ప్రవేశించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా  రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తరకం కరోనా టెన్షన్ పెరిగిపోతోంది. దీంతో ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించడం, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ?  అనే విషయాలు తెలుసుకోవడం ప్రభుత్వ సిబ్బందికి కష్టంగానే మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.



 బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్యకాలంలో 24 మంది వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో పది మందిని గుర్తించగా ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అలాగే శంషాబాద్ ఎయిర్ పోర్ట్, గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమై, విదేశాల నుంచి వస్తున్న వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. వారం రోజులు బ్రిటన్ నుంచి 3 వేల మంది తెలంగాణకు వచ్చారు. వారికి పరీక్షలు అధికారులు నిర్వహిస్తున్నారు.యూకే నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.



ఇప్పటికే ఇద్దరిలో కరోనా  లక్షణాలు బయట పడగా, వారి వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను పంపించారు.అలాగే డిసెంబర్ 9 తరువాత బ్రిటన్ నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని, బయటకు రావొద్దని ఆదేశాల సైతం అధికారులు జారీ చేశారు. అలాగే ఇటీవల బ్రిటన్ నుంచి కరీంనగర్ జిల్లాకు 16 మంది వచ్చారనే సమాచారం అధికారులను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పది మంది శాంపిల్స్ వైద్య అధికారులు సేకరించారు. మిగతా ఆరుగురు సమాచారం తెలియకపోవడంతో అధికారులలోనూ  టెన్షన్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: