టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వైసీపీ లో మరో నలుగురు టార్గెట్ గా ఆపరేషన్ మొదలు పెట్టేశారా ?  అంటే టిడిపి వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అవుననే అంటున్నారు. చంద్రబాబు ను తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఘోరంగా అవమానించిన ఆ నలుగురిని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా టిడిపిలో పెద్ద ఎత్తున ఆపరేషన్ స్టార్ట్ అవుతోందట.

ఆ న‌లుగురి ఓటమే లక్ష్యంగా పని చేయాలని ఇప్పటికే అక్కడి నేతలకు చంద్రబాబు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే వారిని ఓడించడానికి తాను కూడా అంగ , ఆర్థిక సాయాలు చేస్తాన‌ని స్వ‌యంగా హామీ ఇచ్చారని అంటున్నారు. ఆ నలుగురు నేతలు ఎవరో కాదు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మంత్రి కొడాలి నాని - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ - కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి - గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

ఈ నాలుగు సీట్ల లో గుడివాడలో మినహా 2014 ఎన్నికల్లో మిగిలిన మూడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ గెలిచిన విషయాన్ని సైతం చంద్రబాబు పార్టీ నేతలకు గుర్తుచేస్తున్నారు. మిగిలిన మూడు నియోజకవర్గాల సంగతి ఎలా ? ఉన్నా గుడివాడ లో మాత్రం ఎలాగైనా మంత్రి కొడాలి నానిని చిత్తుగా ఓడించి ... నాని ని రాజకీయంగా పూర్తిగా అణిచివేయడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో దివంగ‌త కాపు నేత‌ వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా ను పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. వంగ‌వీటి రాధా, కొడాలి నాని గ‌తంలో స్నేహితులు. అయితే ఇప్పుడు రాజ‌కీయం గా వారి దారులు వేరు అయ్యాయి. అందుకే ఈ సారి రాధా నే నానిపై పోటీ చేయిస్తే గుడివాడ స‌మీక‌ర‌ణ‌లు టీడీపీకి అనుకూలం అవుతాయ‌ని బాబు భావిస్తున్నారు. మరి చంద్రబాబు ఈ వేట ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: