
సిట్ విచారణలో అక్రమ ట్యాపింగ్కు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం లేదని వెల్లడైంది. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ల నుంచి వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని సిట్ తెలిపింది. సాక్షులు తమ ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు బృందం స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్వోటీ) ఏర్పాటు నుంచి హార్డ్డిస్క్ల ధ్వంసం వరకు అనేక అక్రమాలకు పాల్పడినట్లు సిట్ గుర్తించింది.
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ బుధవారం మరోసారి విచారించింది. ఎస్వోటీ ఏర్పాటు, హార్డ్డిస్క్ల ధ్వంసం వంటి కీలక విషయాలపై ప్రణీత్ నుంచి సమాచారం రాబట్టినట్లు సిట్ వెల్లడించింది. ప్రభాకర్ రావు ఈనెల 9, 11, 14 తేదీల్లో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాలతోనే ప్రణీత్ హార్డ్డిస్క్లను మూసీ నదిలో పడేసినట్లు సిట్ విచారణలో తేలింది. ఈ కేసులో సాక్షులు, ఉన్నతాధికారుల వాంగ్మూలాలు నిర్ణాయకంగా మారనున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు