ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తాలూకు హీట్ ఇంకా తగ్గకముందే.. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల జోరు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. ముఖ్యంగా కుప్పం, పులివెందుల వంటి హై ప్రొఫైల్ నియోజకవర్గాలు ఈ ఎన్నికల్లో ఉండటంతో, ఈ స్థానాలకు రాష్ట్ర రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఆగస్టు 10న పోలింగ్ – అదే రోజు ఫలితాలు!: సీఎం చంద్రబాబు ప్రతినిధ్యం వహిస్తున్న కుప్పం, మాజీ సీఎం జగన్ ఆధీనంలో ఉన్న పులివెందుల నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్‌ ఆగస్టు 10న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఫలితాలు అదేరోజు ప్రకటిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఆగస్టు 12న నిర్వహించనున్నారు.


ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది: జూలై 30 వరకు రిటర్నింగ్ అధికారుల నుంచి ఎన్నికల నోటీసులు విడుదల, జూలై 30 – ఆగస్టు 1: నామినేషన్ల స్వీకరణ,  ఆగస్టు 2: స్క్రూటినీ,  ఆగస్టు 3: తిరస్కరణలపై అప్పీల్‌కు చివరి తేదీ.. ఆగస్టు 4: అప్పీల్స్ పరిష్కారం.ఆగస్టు 5: నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు, అదే రోజు తుది అభ్యర్థుల జాబితా విడుదల .  ఈసారి ప్రధానంగా ఎస్ఈసీ ప్రకటించిన మేరకు, పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఒంటిమిట్ట, పులివెందుల, కుప్పం ఎంపీటీసీ పరిధిలో మణీంద్రం, అలాగే కారంపూడి, వేపకంపల్లి, విడవలూరు-1, కొండేపి, కడియపులంక వంటి ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి.



ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది! : ఈ ఎన్నికలు జరగనున్న రెవెన్యూ డివిజన్, మండలాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ప్రకటనలు, నూతన పథకాలు, స్థిరాస్తుల పంపిణీ, అధికార ప్రోగ్రాంలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. హైప్రొఫైల్ ఫైట్... హైటెన్షన్ రాజకీయం! .. కుప్పం, పులివెందుల కేంద్రంగా చంద్రబాబు – జగన్ మధ్య ప్రత్యక్ష పోటీ మళ్లీ తెరపైకి రాబోతోంది. ఈ ఎన్నికల్లో ప్రజా మద్దతు ఏ పార్టీకే ఎక్కువొచ్చిందనేది రాజకీయంగా కీలక సంకేతంగా మారబోతోంది. ఎంసీటోల్లో కాదు.. ఎంపీటీసీ-జెడ్పీటీసీల నుంచే గెలుపు వ్యూహాల మొదలు అన్నట్టు రాజకీయ జోరుకు ఈ చిన్న ఎన్నికలు పెద్ద దిశ చూపించనున్నాయి!



మరింత సమాచారం తెలుసుకోండి: