
మాజీ సీఎం జగన్ కూడా సజ్జల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. “మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుని బయట ప్రకటిస్తే మేమెట్లు సమర్థించగలం?” అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో కొన్ని కీలక నేతల ద్వారా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఒక బ్రాండ్ అని, ఇప్పుడది ఎటు దారి తీస్తుందో స్పష్టత లేకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని వారు అంటున్నారు. వాస్తవానికి జగన్ అమరావతికి పూర్తిగా వ్యతిరేకం కాదు. కానీ విస్తృత స్థాయిలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికకే ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే మూడు రాజధానుల ఆలోచనను ముందుకు తెచ్చారు. అయితే ఈ అంశాన్ని ప్రజల్లోకి సరిగా తీసుకువెళ్లడంలో పార్టీ విఫలమైంది. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పడం వల్ల రాజకీయంగా వైసీపీ కష్టాల్లో పడినట్టే అనుకోవాలి.
మొత్తం మీద, అమరావతి రాజధాని విషయంలో వైసీపీ లోపల ఒక్కో నేత ఒక్కో రీతిగా వ్యాఖ్యలు చేయడం, వాటిని సమర్థించలేకపోవడం, అంతర్గత అసంతృప్తి పెరుగుతుండటం పార్టీకి మరింత సవాల్గా మారింది. మరి దీని నుంచి జగన్ ఎలా తట్టుకుంటారో ? ఏ స్టాండ్తో ముందుకు వెళతారో ? చూడాలి.