![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/pak27429996-4962-4656-9257-0db73d86a5c4-415x250.jpg)
కానీ ఎక్కడ ఆట తీరుతో ప్రభావం చూపలేక పోతుంది. ప్రత్యర్ధుల చేతిలో చిత్తుగా ఓడిపోతుంది అని చెప్పాలి. ఏకంగా సొంత గడ్డమీద మ్యాచులు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ ఆటతీరులో ఎక్కడ మార్పు రావడం లేదు. అయితే బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి కొత్త సారధులను నియమించిన పాకిస్తాన్ తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇటీవల ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అశ్రాఫ్ ఏకంగా పదవికి రాజీనామా చేశారు.
అయితే ఇలా జట్టు వరుస ఓటమిలు, నిర్వహణ వైఫల్యం పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది అనేది తెలుస్తుంది పలువురు ఆటగాళ్లు బోర్డుతో కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని భావిస్తున్నారట. విదేశీ టీ20 టోర్నీలో ఆడేందుకు అనుమతించకపోవడమే ఇందుకు కారణం అన్నది తెలుస్తుంది. జమాన్ కాన్, ఫకర్ జమాన్, మహమ్మద్ హరీష్ వంటి స్టార్ ప్లేయర్లకు సెంట్రల్ కాంటాక్ట్ ఉండగా.. వారికి ఇతర దేశాల లీగ్ లలో ఆడేందుకు క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వలేదు దీంతో ప్లేయర్లు అసంతృప్తితో ఉన్నారు అన్నది తెలుస్తోంది.