ఐపీఎల్​ రెండో అర్ధభాగంలో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్ దుమ్మురేపుతోంది. ​వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. షార్జా వేదికగా జరిగిన పోరులో కోల్​కతా నైట్​ రైడర్స్​పై ఎనిమిది వికెట్లు తేడాతో విజయం సాధించింది. 150 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​.. ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో మన్​దీప్​ సింగ్​(66), గేల్​(51) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్​కు మార్గం సుగమం చేసుకుంది. కోల్​కతా బౌలర్లలో వరుణ్​ చక్రవర్తి ఒక్క వికెట్​ తీశాడు.



అంతకముందు టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన కోల్‌కతా మోస్తారు స్కోరు మాత్రమే చేసింది. రవి బిష్ణోయ్‌ (2/20), మహ్మద్‌ షమి (3/35), మురుగన్‌ అశ్విన్‌ (1/27), క్రిస్‌ జోర్డాన్‌ (2/25) సమష్టిగా చెలరేగి మోర్గాన్‌ సేనను దెబ్బకొట్టారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 149/9కే పరిమితమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: