ఈటెల రాజేందర్ బావ మరిది, జమునా రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డి వాట్సప్ చాటింగ్ ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. మధు సుధన్ రెడ్డి ..ఈటెల పౌల్ట్రీ పార్టనర్ తో చేసిన ఫోన్ వాట్సప్ చాట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈటెల కుటుంబాన్ని కలవరపెడుతుంది. దళిత బంద్ స్కీం పైన ఆరా తీసిన మధుసూదన్.. నారాయణ గూడలో పది కోట్లు తీసుకో అంటూ చాటింగ్ చేయడం హాట్ టాపిక్ అయింది.

కమలాపూర్ లో 4 కోట్లు మిగతావి జమ్మికుంటలో ఇవ్వాలని చాటింగ్  చేసినట్టుగా బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ఆ చాటింగ్ నాది కాదన్న ఆయన రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఫేక్ చాటింగ్ తో హింసిస్తున్నారు అని దళిత బంధు వికటించింది అని మండిపడ్డారు. దళితులు అంతా ఈటెల వైపే ఉన్నారు అని అందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: