దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చేసింది. రిజర్వేషన్ చార్జీలు తప్పకుండ ఉంటాయని అదికూడా రెండో తరగతి ప్రయాణికులకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాలలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ విధంగా జవాబు ఇచ్చారు. కరోనా సందర్భంగా ఇచ్చిన ఏవైనా సడలింపులు తప్పించి, సాధారణ రైళ్లలో కూడా రెండో తరగతి ప్రయాణాలు రిజర్వేషన్ పద్దతిలోనే సాగుతాయని, వాటికీ రిజర్వేషన్ రుసుము ఉంటుందని ఆయన తెలిపారు. అంటే ఎక్కడకు టికెట్ తీసుకున్నప్పటికీ, మొత్తం ఈ చార్జీలు చెల్లించాల్సిందే. అలా వద్దు అనుకున్నవారు సాధారణ తరగతి బోగీలో ప్రయాణించాల్సి ఉంది.
కరోనా సమయంలో రైల్వే శాఖ 2020-21 కి గాను 364 సాధారణ రైళ్లను కూడా ఎక్స్ ప్రెస్ రైళ్ళగా మార్చేసింది. ఈ వర్గీకరణ వలన వివిధ రైళ్లలో ప్రయాణాలపై మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే టికెట్ ధరలలో ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ, రిజర్వేషన్ చార్జీలు మాత్రం తప్పట్లేదు. ఇక వేగం పెంపు అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయా అంశాలు సర్దుబాటులోకి రావడం జరిగిన తరువాతనే వేగం పెంపు అనేది నిర్దారణకు రావడం జరుగుతుంది. ఇది బాగానే ఉన్నప్పటికీ, కనీసం జనరల్ బోగీల సంఖ్య పెంచితే సాధారణ ప్రయాణికులకు మేలుగా ఉంటుంది అనేది ప్రయాణికుల అభిప్రాయం. దానికి తగ్గట్టుగా రెండో తరగతిలో కూడా బోగీలు పెంపు ఉంటె బాగుంటుంది. గతంలో మాదిరి అక్కుపెన్సీ కుదరదు కాబట్టి, దానికి తగ్గట్టుగా బోగీలు పెంచితే సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణికుల నుండి స్పందన అంటే రిజర్వేషన్ లు ఎక్కువగా జరుగుతుంటే దానికి తగ్గట్టుగా బోగీలను పెంచే యోచన రైల్వే శాఖ చేపట్టవచ్చు.