గుంటూరులోని ఆంధ్రప్రదేశ్
గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల మైనార్టీ జూనియర్
కళాశాలల్లో ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఈ కాలేజీల్లో
ఏపీఆర్జేసీ-సెట్తో సంబంధం లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశం
కల్పిస్తారు.. ముస్లిం మైనార్టీ బాలబాలికలు మాత్రమే అర్హులు.
ఖాళీలు ఉన్న కళాశాలలు: గుంటూరు (బాలురు), కర్నూలు (బాలురు), వాయిల్పాడు-చిత్తూరు (బాలికలు).
అందుబాటులోఉన్న గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ. ఒక్కో కాలేజీలో వరుసగా 40, 40, 35 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బోధనా మాధ్యమం: ఉర్దూ, ఇంగ్లిష్.
అర్హతలు: ముస్లిం మైనార్టీ బాలబాలికలు మాత్రమే అర్హులు.
2018 మార్చి/ ఏప్రిల్ పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 10, 2018
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25, 2018
మరిన్ని వివరాలు
వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.apresidential.gov.in