ఏపీలోని సచివాలయాల్లో 16,207 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే అంటే జనవరి 31 చివరిరోజు.. గ్రామ సచివాలయ పోస్టులు 14,061, వార్డు సచివాలయ పోస్టులు 2,146 ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 16,207.
జనవరి 11 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జనవరి 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
గతేడాది 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. వాటిలో మిగిలిన ఉద్యోగాలతోపాటు.. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే తాజా నోటిఫికేషన్కు కూడా వర్తిస్తాయి.
ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇస్తారు. రాతపరీక్ష ద్వారానే గ్రామ సచివాలయాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాతపరీక్షలు ఉంటాయి. అవసరాలకు అనుగుణంగా నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందని అధికారులు అంటున్నారు.