'నన్ను దోచుకుందువటే'తో టాలీవుడ్ కు పరిచయమైంది కన్నడ బ్యూటీ నాభా నటేష్ . ఈసినిమా యావరేజ్ గా ఆడినా ...  కథా బలం వున్న పాత్ర దక్కడంతో  ఆ పాత్రలో నాభా దుమ్మురేపింది. దాంతో  మొదటి సినిమాతోనే  నాభా పేరు మార్మోగింది.  అయితే పేరు వచ్చింది కానీ  ఈ సినిమా తరువాత ఆఫర్లు మాత్రం రాలేదు. ఆ క్రమంలో   డ్యాషింగ్ డైరెక్టర్  పూరి జగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' లో  ఓ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఇటీవల విడుదలైన  ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ పేరు మాత్రం మొత్తం రామ్ కు వెళ్ళింది. 



ఎందుకంటే ఈసినిమాలో నాభా పెద్దగా చేసింది ఏం లేదు. గ్లామర్ తో మాత్రమే ఆకట్టుకుంది. అయితే  నాభా ప్రస్తుతం  మాస్ రాజా రవితేజ సరసన  'డిస్కో రాజా' లో నటిస్తుంది. ఈ సినిమా లో ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంటుందట. దాంతో కేవలం గ్లామర్ పరంగానే కాదు ఈ సినిమాతో మరోసారి మంచి నటిగా నిరూపించుకుంటానని  తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో నాభా  పేర్కొంది.  ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ ఢిల్లీ లో జరుగుతుంది. 



 ఇటీవలే నాభా ఈసినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  డైరెక్షన్ లో  సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో   నాబా నటేష్  తోపాటు  పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్  కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ ఫై  రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం నాభా నటేష్  చేతిలో ఈ ఒక్క సినిమా మాత్రమే వుంది.  ప్రస్తుతం ఆమె మంచిఆఫర్ల కొరకు ఎదురుచూస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: