వరుస ఫ్లాపుల మీద ఉన్న కుర్ర హీరో నితిన్ ఈ ఏడాది ప్రారంభంలో "భీష్మ" సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ సినిమా విజయం తర్వాత నితిన్ నటించిన లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఆ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన "భీష్మ" తో విజయం సాధించి ఈ ఏడాదిలో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్టైనర్ తరహాలో “రంగ్ దే” అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్.. నితిన్, కీర్తి సురేష్పోస్టర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా కొద్దిపాటి బ్యాలెన్స్ కలిగిన ఈ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి పరిస్థితులను బట్టి మిగతా సినిమాలను ఒప్పుకోవాలనే ఆలోచనలో నితిన్ ఉన్నట్లు టాక్. కరోనా వలన వచ్చిన కష్టాలు మొత్తం తీరిపోతే, సినిమా ధియేటర్ లు మళ్లీ ఓపెన్ అయితే నితిన్ వరుసగా సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఈ తరుణంలో నితిన్ కి స్టోరీ చెప్పటం కోసం కృష్ణ చైతన్య, చంద్ర శేఖర్ ఏలేటి రెడీగా ఉన్నారట. 
 
మరోపక్క ఈనెలాఖరులో నితిన్ పెళ్లి జరగనున్న తరుణంలో చాలా వరకు గ్యాప్ తీసుకునే ఆలోచనలో నితిన్ ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్త విన్న కొంతమంది అభిమానులు, అసలే కరోనా చాల గ్యాప్ తీసుకొచ్చింది, మళ్లీ గ్యాప్ అంటే ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు పడితే మొత్తానికి కెరియర్ బ్యాడ్ అవ్వటం గ్యారెంటీ అని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: