టాలీవుడ్ లో ఇటీవలే జాను సినిమా తో ప్రేక్షకులను పలకరించింది సమంత. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. శర్వానంద్, సమంత కలిసి నటించిన ఈ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ చిత్రం తర్వాత సమంత మరే సినిమాకు సైన్ చేయలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫుల్ బిజీగా మారిపోయింది. కేవలం సినిమాలతోనే కాకుండా వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేస్తోందీ అక్కినేని వారి కోడలు. వివాహాం తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న ఈ చిన్నది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోంది.


 రంగస్థలంలో డీ గ్లామర్‌ పాత్రలో నటించి మెప్పించిన సమంత ఇప్పుడు మరో ఛాలెంజింగ్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె హీరోయిన్ సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి మంచి స్నేహితులు. 'ఓ బేబీ'తో వాళ్ళిద్దరూ మంచి విజయాన్ని అందుకున్నారు. తరవాత వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారని వినిపించింది. ఆ ప్రాజెక్ట్ ఇన్నాళ్ళకు పట్టాలు ఎక్కబోతుందని సమాచారం. 'ఓ బేబీ' ఫాంటసీ కామెడీ అయితే... ఇప్పుడు చేయబోయేది థ్రిల్లర్ అట. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.వాస్తవానికి, సమంత ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ సంస్థ ఓ సినిమా నిర్మించాలని సన్నాహాలు చేసింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన దర్శకుడు సినిమా నుండి తప్పకున్నారట.కథను మాత్రం ఇచ్చారట. ఇప్పుడు ఆ కథతో నందినీ రెడ్డి సినిమా చేస్తున్నారట.


 సోనీ పిక్చర్స్ సంస్థకి ఆమె పేరును సమంత సూచించారట. అయితే, అశ్విన్ ఇచ్చిన కథను ఉన్నది ఉన్నట్టుగా తీయకుండా బెటర్ మెంట్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నారట. జనవరి లేదా ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.ఇక సమంతకు థ్రిల్లర్ సినిమాలు చేయడం ఏమీ కొత్త కాదు. తాను గతంలో యూ టర్న్, రాజుగారి గది2 లాంటి థ్రిల్లర్ సినిమాల్లో నటించి మంచి నటనను కనబర్చింది. అందుకే నందినీ రెడ్డి ఈ కథకు సమంత అయితే న్యాయం చేస్తుందని భావించి.. ఆమెను సెలెక్ట్ చేసుకుందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: