రోహిత్ శెట్టి గత సినిమాలను పరిశీలిస్తే కామెడీ పై అతనికి ఉన్న పట్టు ఎంటో అర్థం అవుతుంది. లాక్డౌన్ లో సరైన స్క్రిప్ట్లను ఎంచుకోవడంలో గడిపిన రణవీర్, భూషణ్ కుమార్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు నవంబర్లో సెట్స్కు తిరిగి వస్తారు. గత రెండు నెలలుగా మెరుగులు దిద్దుకుంటున్న ప్రాజెక్టుపై ప్రొడక్షన్ హౌస్ వివరణ రావాలి. రణ్వీర్ సింగ్ , శెట్టి ఇద్దరూ వరుసగా 83 , సూర్యవంశీల థియేటర్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకరికొకరు విడిపోయిన ఒకేలాంటి కవలల పాత్రలో రణవీర్ నటించనున్నారు. వీరిద్దరి మ్యానిరిజం సినిమాలో ఒకటెలా ఉండి అభిమానులకు వినోదాన్ని పంచనుంది.
బాలీవుడ్ లో డబుల్ రొల్ లో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల నుంచి సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇపుడున్న హీరోల్లో ఇది ఒక ప్రయోగం అని చెప్పుకోవాలి. దర్శకుడి పై నమ్మకం తోనే రణవీర్ సినిమాను ఒప్పుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా కపిల్ దేవ్ బయోపిక్ 83 తర్వాత ఒక కామెడీ అంశం ఉన్న సినిమాను రణవీర్ ఎంచుకోవడం వెనుక మర్మం ఏమిటో తెలియట్లేదు. ఈ సినిమాలో నటిస్తున్న పూజాహెగ్డే తో రణవీర్ కి ఇది మొదటి చిత్రం కాగా, రోహిత్ దర్శకత్వంలో ఇంతకుముందు హౌస్ ఫుల్ 4 లో నటించిన సంగతి తెలిసిందే.