ఇలాంటి డైరెక్టర్.. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. కరోనా మహమ్మారి కొంచెం తగ్గుముఖం పట్టిన తరువాత ఈమధ్యే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పటి వరకు సగం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుందట కూడా. సమ్మర్ లో రిలీజ్ చేద్దామనే ఉద్దేశ్యంతో చిత్రాన్ని చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు పూరీ. అయితే అనుకున్న టైంకి ఈ సినిమా విడుదల జరగదట.
దీనికి షూటింగ్ ఆలస్యం కావడం ఓ కారణం కాగా, ఇప్పటికే వేరే సినిమాలు విడుదల తేదీలు లాక్ చేసుకోవడం మరో కారణం. ఈ కారణాలతో ‘లైగర్’ సినిమా సమ్మర్ రేసులో నుంచి తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. తాజా సమాచారం మేరకు, ఈ సినిమాని కనీసం జులైలో అయినా తీసుకొని రావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే జూలై నెలలో ఈ చిత్రం థియేటర్లలో వస్తుంది.