రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమ్మర్ వార్ నుంచి తప్పుకున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ప్రస్తుతం సినీ వర్గాల నుంచి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ‘లైగర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని మేకర్స్ మొదట అనుకున్నారు. దీనికి ఓ ప్రధాన కారణం డైరెక్టర్ పూరీ జగన్నాథ్. సినిమాలను వేగంగా పూర్తి చేయడంలో పూరీ జగన్నాథ్ తరువాతే ఎవరైనా అని చెప్పాలి. తెలుగులో ఈయన పూర్తి చేసినంత వేగంగా సినిమాలు మరే దర్శకుడూ చేయలేడని అభిమానులు గర్వంగా చెప్పుకోవడం కొత్తేమీ కాదు. షూటింగ్ అనే కాదు, ఆయన సినిమా కూడా స్క్రీన్ పై అంతే వేగంగా పరుగెడుతుంది. ప్రేక్షకులను కూడా పరిగెత్తిస్తుంది.

ఇలాంటి డైరెక్టర్.. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. కరోనా మహమ్మారి కొంచెం తగ్గుముఖం పట్టిన తరువాత ఈమధ్యే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పటి వరకు సగం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుందట కూడా. సమ్మర్ లో రిలీజ్ చేద్దామనే ఉద్దేశ్యంతో చిత్రాన్ని చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు పూరీ. అయితే అనుకున్న టైంకి ఈ సినిమా విడుదల జరగదట.

దీనికి షూటింగ్ ఆలస్యం కావడం ఓ కారణం కాగా, ఇప్పటికే వేరే సినిమాలు విడుదల తేదీలు లాక్ చేసుకోవడం మరో కారణం. ఈ కారణాలతో ‘లైగర్’ సినిమా సమ్మర్ రేసులో నుంచి తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. తాజా సమాచారం మేరకు, ఈ సినిమాని కనీసం జులైలో అయినా తీసుకొని రావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే జూలై నెలలో ఈ చిత్రం థియేటర్లలో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: