ఇప్పటికే ఇండస్ట్రీలో ఆగ్ర హీరోల వారసులంతా దాదాపుగా అందరూ వచ్చేసారు. నందమూరి వంశం నుంచి ఒక్క బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మాత్రమే మిగిలిపోయాడు. ఈయన డెబ్యూ సినిమా గురించి గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నప్పటికి ఇంతవరకు దీనిపై ఎలాంటి సమచారం లేదు. బాలయ్య కూడా ఎప్పటికప్పుడు తనయుడి సినిమా త్వరలోనే ఉంటుందని ఊరిస్తున్నప్పటికి కార్య రూపం దార్చడం లేదు. అయితే దీనికి ప్రదాన కారణం మోక్షజ్ఞ సినిమాలపై ఆసక్తి కనబరచడం లేదట. ఆయన బిజినెస్ చేసుకోవాలని చూస్తునట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బాలయ్య ఓ మోక్షజ్ఞ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకొనున్నడని సమాచారం. .
అదేంటంటే.. ఈయన తన కొడుకును అమెరికా పంపించి న్యూయార్క్లో ఉన్న లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకునే విధంగా బాలయ్య మోక్షజ్ఞను ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడికి వెళ్తే అయినా నటనపై ఆసక్తి కలుగుతుందని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా కాలం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మోక్షజ్ఞ సినిమా వైపు అడుగులు వేస్తాడా లేక తన మనసుకు నచ్చిన ఇతర బిజినెస్ వైపు అడుగులు వేస్తాడా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. .