ఇక ఈమెతో పాటు ఎంతో మంది హీరోయిన్లు కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల లావణ్య త్రిపాఠి కూడా ఒక కేఫ్ ను నిర్మించబోతోంది. ఇక ఇదే దారిలో మరొక హీరోయిన్ నడుస్తోంది.ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆకాంక్ష సింగ్. ఈమె కూడా కరోనా సమయం లో లాక్ డాన్ విధించడంతో ఖాళీగా ఉండడం ఎందుకని ,ఒక కేఫ్ ను ఏర్పాటు చేసి ,ఆ కేఫ్ ప్రారంభానికి ప్రత్యేకమైన అతిథులను గెస్ట్ లుగా పిలిచింది.
అయితే కేఫ్ పెట్టాలనేది ఆకాంక్ష సింగ్ చిరకాల కోరిక. ఇక తన బావ అయిన అభిషేక్ సహాయంతో ఆమె కేఫ్ ను ప్రారంభించింది. తన స్వస్థలమైన జైపూర్ లో ఒక అందమైన ప్రదేశాన్ని ఎంచుకొని , అందులో కేఫ్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ కేఫ్ లో కేవలం పగలు మాత్రమే కాదు రాత్రి పూట కూడా గడపడానికి మంచి ప్రదేశం అని ఆకాంక్ష తెలిపింది. ఇక ఈ కేఫ్ ను జూలై 15వ తేదీన పిల్లల సమక్షంలో ప్రారంభించారు. ఎన్జీవో కు చెందిన కొంతమంది పిల్లలను అతిథులుగా పిలిచి , వారితో రిబ్బన్ కటింగ్ చేయించింది ఆకాంక్ష..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.." పిల్లలను చీఫ్ గెస్ట్ గా పిలవడానికి ముఖ్య కారణం ఏమిటంటే, వారి ముఖంలో కనిపించే చిరునవ్వు నాకు కోట్ల తో సమానం. అందుకే వారిని ముఖ్య అతిథులుగా పిలిచాను. నాకు ఇది వారి ఆశీర్వాదం అని కూడా తెలిపింది. అంతేకాదు వీరితో మ్యూజికల్ చైర్స్ గేమ్స్ కూడా ఆడాము. డాన్స్ కూడా చేశాము. అలాగే పిల్లలకు ఇష్టమైన నూడిల్స్, పిజ్జా, బర్గర్ వంటి వారికి ఇష్టమైన ఫుడ్ మెను కూడా తయారు చేశాము అంటూ తెలిపింది ఆకాంక్ష.