మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ వారసుడు అని అందరికి తెలిసిందే.
సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ బాబు మాత్రమే కాకుండా రమేష్ బాబు,
మంజుల, పద్మావతి,
ప్రియదర్శి సంతానం. నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ప్రేక్షకులను గత 50 సంవత్సరాలుగా అలరిస్తూ
సూపర్ స్టార్ గా ప్రఖ్యాతి పొందారు. ఆయన తర్వాత సినిమాలలోకి ఆయన వారసుడిగా మహేష్ బాబు, రమేష్ బాబు,
మంజుల, అల్లుడు సుధీర్ బాబు వచ్చి
సూపర్ స్టార్ కృష్ణ పేరు నిలబెట్టే విధంగా సినిమాలలో చేస్తున్నారు.
2010 సంవత్సరం తర్వాత ఆయన
సినిమా నుంచి నుంచి విరమించుకున్నాడు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకోవాలని ప్రయత్నాలు చేసిన
కృష్ణ ఆ తర్వాత వృద్ధాప్యం మీద పడడంతో దానికి దూరంగా ఉన్నాడు. చదువుకుంటున్న రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు కు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి తాను కూడా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా సినిమాల్లోకి వచ్చి మంచి పేరును తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు.
సినిమా పరిశ్రమలో ఏ హీరోకి లేనంతగా 2,500 అభిమాన సంఘాలు ఆయనకు ఉండేవి ఆయనకు.
హీరోగా మంచి క్రేజ్ ఉన్న టైంలో 30 వేల మంది దాకా అభిమానులు ఆయన శత దినోత్సవానికి బస్సుల్లో తరలి వచ్చేవారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే
ఇందిరా దేవిని 1965 వ సంవత్సరంలో వివాహం చేసుకోగా రమేష్ బాబు పద్మావతి
మంజుల మహేష్ బాబు ప్రియదర్శిని జన్మించారు. 1969లో కృష్ణతో సినిమాల్లో నటించి విజయనిర్మల ఆయనకు దగ్గర కాగా అప్పట్లో వారి ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే
ఇందిరా కు దూరం అవుతూ
విజయ నిర్మల దగ్గరయ్యాడు. కొంతకాలం తర్వాత ఆమెను రెండో
పెళ్లి చేసుకున్నాడు కృష్ణ. కానీ పిల్లలు కనలేదు.
కృష్ణ దూరం కావడంతో పెద్ద కొడుకు రమేష్ బాబు తో ఉండేది
ఇందిరా దేవి. ఇప్పుడు కూడా రమేష్ బాబు తోనే ఆమె ఉంటుందట. తల్లి యోగక్షేమాలు తెలుసుకొని అప్పుడప్పుడు మహేష్ బాబు కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడట.