సూపర్ స్టార్ మహేష్, కీర్తి సురేష్ ల కలయికలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ కి సంబంధించి ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం మహేష్ లేకుండా పలు సీన్స్ తీస్తున్నారట యూనిట్. కాగా ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ నెక్స్ట్ వారం జాయిన్ కానున్నారని సమాచారం. మహేష్ బాబు, కీర్తి సురేష్ ల జోడీ స్క్రీన్ పై అదిరిపోతుందని, అలానే ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు పరశురామ్ పెట్ల ఎంతో అద్భుతంగా తీస్తున్నారని సమాచారం.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు తీస్తుండగా మది కెమెరా మ్యాన్ గా పని చేస్తున్నారు. ఇక ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన బ్లాస్టర్ టీజర్ అందరిని ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే విషయం ఏమిటంటే, ఫస్ట్ సాంగ్ కళావతి అనే పల్లవితో సాగుతుందని, కొద్దిసేపటి క్రితం సర్కారు వారి పాట యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.

అలానే ఈ సాంగ్ కి సంబంధించి ఈనెల 9న అలానే 11న మరొక రెండు అప్ డేట్స్ రానుండగా లిరికల్ సాంగ్ ని 14న విడుదల చేయనున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సాంగ్ మంచి మెలోడియస్ గా రొమాంటిక్ స్టైల్ లో సాగే ఈ కళావతి సాంగ్ ని అనిరుద్, సిద్ శ్రీరామ్ లలో ఒకరు ఆలపించారని, కాగా దీనిపై త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మిగతా సాంగ్స్, ట్రైలర్ ని రిలీజ్ చేసిన అనంతరం మూవీని మే 12న రిలీజ్ చేయనుంది యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: