టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే గత కొంత కాలంగా తన సినిమాలు వరుసగా ఫ్లాప్ లు అవడంతో సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో.ప్రస్తుతం ఇప్పుడు రాజ్ తరుణ్ వెండితెరను కాదనుకుని ఓటీటీ బాట పట్టేశాడు. అయితే వరుసగా వెబ్ సీరిస్‌లు చేస్తున్నాడు.ఇక  తమడ మీడియా మరియు జీ5 సంయుక్తంగా నిర్మించబోయే ఓ వెబ్ సీరీస్‌లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు.అయితే అల్లరి నరేష్ హిట్ మూవీ అహనా పెళ్లంట టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఇకపోతే మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన స్టార్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ నటిస్తోంది.

అంతేకాదు  అలాగే సీనియర్ నటి ఆమనితో పాటు పోసాని కృష్ణమురళీ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.ఇకపోతే ఈ వెబ్‌ సిరీస్‌ రాజమండ్రి, పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకుంటుంది.కాగా  రాజ్‌తరుణ్‌ తొలిసారిగా వెబ్‌సిరీస్‌లో నటించడం వెబ్‌ సిరీస్‌లకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం.అయితే  ఈ మధ్య కాలంలో అన్ని భాషలలోని హీరోలు సైతం ఈ వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇకపోతే ఈ జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్.. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేదిగా ఉంటుంది. కాగా కామెడీ డ్రామా, రొమాన్స్‌లతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ 30 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ ప్రసారం అవుతాయని అన్నారు.  ఈ వెబ్ సీరిస్ కాన్సెప్ట్ ఏంటనేది బయటకు వచ్చి ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇక  ఎన్నో ఏళ్ల నుంచి ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు రాజ్ తరుణ్‌. అయితే ఎట్టకేలకు ఓ అమ్మాయితో పెళ్లి కుదురుతుంది.కాగా  పెళ్లి పీటలు కూడా ఎక్కుతాడు.ఇక కరెక్టుగా తాళి కట్టే టైంలో రాజ్ తరుణ్ కలలపై నీళ్లు జల్లి పెళ్లి కూతురు శివాని తన భాయ్ ఫ్రెండ్‌తో కలిసి లేచిపోతుంది. అయితే దీంతో రాజ్ తరుణ్ తీవ్ర మనోవేదకు గురైపోతాడు. ఇకపోతే శివానితో పాటు ఆమె భాయ్ ఫ్రెండ్‌పై పగతో రగిలిపోతాడు.. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత రాజ్ తరుణ్ ఎలాంటి ? పరిణామాలు ఎదుర్కొన్నాడు ? కథలో ఏం జరిగింది అన్నదే ఈ వెబ్ సీరిస్‌ అన్నమాట.ఇకపోతే  ఈ వెబ్ సీరిస్‌తో ఓటీటీలో అయినా రాజ్ తరుణ్ క్లిక్ అవుతాడేమో ? చూడాలి.ఇకపోతే ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ అని.. అందరినీ అలరించేలా ఈ సిరీస్ ఉంటుందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: