లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పటికే శింబు, ప్రభుదేవా వంటి స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ కొన్ని కారణాల వల్ల ఇద్దరికీ బ్రేకప్ చెప్పేసింది. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టడం తో తన కెరియర్ లో విజయపథా లను  చూసిన ఈమె చివరిగా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను  ఏడు సంవత్సరాలుగా ప్రేమిస్తోంది. ఇక ఒకరికొకరు ప్రేమించుకున్న వీరిద్దరూ గత సంవత్సరం నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కరోనా  సమయం కాబట్టి పెద్దగా అతిథులను ఎవరిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇకపోతే ఈ రోజు ఉదయం 8:30 గంటలకు నయనతార మెడలో హిందూ సాంప్రదాయం ప్రకారం విఘ్నేష్ శివన్ తాళి కట్టారు.

ఇకపోతే కత్రినాకైఫ్ లాగా ఈమె కూడా తమ వివాహ వేడుకలకు హాజరయ్యే వారికి కొన్ని షరతులు కూడా విధించింది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి అని.. తమ అనుమతి లేనిదే ఫోటోలను,  వీడియోలను షేర్ చేయకూడదు అని కూడా తెలిపింది. ఎందుకంటే ప్రముఖ ఓ టీ టీ నెట్ ఫ్లెక్స్ కి రూ.2.5 కోట్లకు వీరి పెళ్లి వీడియో ని అమ్మినట్లు సమాచారం అందుకే ఆమె ఈ నియమాలు పెట్టిందట. ఉదయం వీరి వివాహం జరగగా ఇప్పటి వరకు వీరి పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా విడుదల కాలేదు కానీ ఇప్పుడు నేరుగా పెళ్లి కొడుకు విఘ్నేష్ శివన్ తన భార్య నయనతారను ప్రేమగా ముద్దాడుతూ ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి ఈమె నా జీవితంలోకి రావడం అదృష్టం అంటూ పోస్ట్ కూడా చేశాడు.

ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి దీవెనలతో పాటు తల్లిదండ్రులు అలాగే స్నేహితులు సన్నిహితులు ప్రేమాభిమానాలు కూడా తమపై ఉండాలి అని తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ ట్విట్టర్లో వదిలాడు .ఇక ఇది కాస్త బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: