విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శృతిహాసన్. మొదట ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు పొంది ఆ తర్వాత ఎవరు ఊహించని స్థాయిలో స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఇక శృతిహాసన్ కి చిన్న వయసు నుండి మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది. అలా సింగర్ గా డాన్సర్ గా ఎన్నో ఆల్బమ్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ నటించిన ఈనాడు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఈమె పని చేసింది. గతంలో ఎడ్జ్ అనే మ్యూజిక్ వీడియోతో శృతిహాసన్ ఆకట్టుకుంది.


అయితే ఇప్పుడు తాజాగా షి ఈజ్ ఎ హీరో అని మరొక స్పెషల్ వీడియో సాంగ్ తో ముందుకు రావడం జరిగింది. ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయడమే కాకుండా.. స్వయంగా లిరిక్స్ కూడా రాసి పాడడం జరిగిందట. ఇక ఈమెతో పాటు ప్రముఖ రావన్ ఎం సి అల్తాఫ్ కూడా ఉన్నారు. ఈ పాట నిన్నటి రోజున శృతిహాసన్ తన అధికారికంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే హీరో ప్రభాస్ ఈ పాటను షేర్ చేస్తూ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.షి ఈజ్ ఎ హీరో అనే కొత్త వీడియో సాంగ్ ని విడుదల చేసిన సందర్భంగా శృతిహాసన్ కు అభినందనలతో పాటు టీమ్ మొత్తానికి కూడా ఇంకెడిబుల్ వర్క్ అని ప్రభాస్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ మరియు శృతిహాసన్ ఇద్దరు కలిసి సలార్ అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాసభిమానులు ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేందుకు సన్నహాలు జరుగుతున్నా. ఒక శృతిహాసన్ పాడిన షి ఈజ్ ఎ హీరో సాంగ్ విషయానికి వస్తే మహిళలకు పోరాటాలు మరియు విజయాలకు సంబంధించిన సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: