హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమా  షూటింగ్ కూడా మొదలై దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది.ఈ సినిమాకి టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. మొగలుల కాలంనాటి బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎప్పటినుంచో చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.2020 వ సంవత్సరంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అయ్యింది. ఇంకా ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది.ఇంకా దాదాపుగా 40 శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారాలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో రెండు పాటలు కూడా షూటింగ్ చేయవలసి ఉందని సమాచారం.


అయితే ఇది పీరియాడిక్ మూవీ కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుందని మేకర్స్ భావిస్తూ ఉన్నారు.అయితే మరి రాజమౌళిలా ఇన్ని సంవత్సరాలు తీసుకోవడంపై ఫ్యాన్స్ చాలా అసంతృప్తిని తెలియజేస్తున్నారు.షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి టాకీ కంప్లీట్ అయితే తప్ప టీజర్ ని విడుదల చేయరని సినీవర్గాల నుంచి చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది ఈ సినిమాకి చాలా షూటింగ్ బ్రేక్స్ పడ్డాయి. వాయిదాల వలన చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వీరమల్లు సినిమా మధ్యలోనే బలైపోతుంది అంటూ అభిమానులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ కి సరిగ్గా వెళ్లట్లేదని సమాచారం తెలుస్తుంది.అందుకే ఈ సినిమా చాలా ఆలస్యం అవుతూ వస్తుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తరువాత రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వనున్నాడు.ఇక ఈ విధంగా హరి హర వీరమల్లు సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకి పవన్ వల్ల నిరాశ తప్పేటట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: