స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన సినిమా నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా సైనికుడి గొప్పతనం గురించి దేశం కోసం అతను ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉంటాడని చూపించారు. ఇక ఈ సినిమా కథ ముందు ఎన్టీఆర్ కు చెప్పాడని ఓ న్యూస్ బయటకు వినిపిస్తుంది. 


నా పేరు సూర్య కాదు నా పేరు ఎన్.టి.ఆర్ అంటూ కొందరు ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ నటించిన సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ డైరక్టర్ గా చేసిన మొదటి ప్రయత్నం నా పేరు సూర్య. ఈ సినిమా కథ ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడని ఆయన కాదన్నాకనే బన్ని దగ్గరకు వచ్చిందని అన్నారు.  


నా పేరు సూర్య ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు వక్కంతం వంశీ. నా పేరు సూర్య కేవలం అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథ మాత్రమే అని బయట వినిపిస్తున్నట్టుగా ఎన్.టి.ఆర్ కు ఈ కథ చెప్పలేదని అన్నారు. ఇక ఎన్.టి.ఆర్ కోసం తాను కథ సిద్ధం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు వంశీ.


అసలైతే టెంపర్ సినిమా రచయిత అయిన వక్కంతం వంశీ ఆ సినిమాను ఎన్.టి.ఆర్ హీరోగా డైరెక్ట్ చేయాలని చూశాడు. కాని ఎన్.టి.ఆర్ నిర్మాత బండ్ల గణేష్ ఎందుకో రిస్క్ తీసుకోలేకపోయారు. అందుకే నా పేరు సూర్య ఈవెంట్ టైంలో నా మూడున్నర ఏళ్ల కల నెరవేర్చిన మగాడు బన్ని అని అన్నాడు వంశీ.  



మరింత సమాచారం తెలుసుకోండి: