టాలీవుడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ప్రముఖ నిర్మాత, దర్శకులు వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం కాలం పూర్తయ్యింది. ఈ మద్య ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. మహేష్ 25వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతం చేసి మే 9న మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా మహేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. తన స్నేహితుడి కోసం ఇండియాకు వచ్చి రైతుల కష్టాలు చూసి ఒక సామాన్య యువరైతుగా వారి కష్టాలు ఎలా గట్టేక్కించాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు.