నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం 'అర్జున్ సురవరం'. ఆయితే నిఖిల్ కి ఈ మధ్య అసలు టైం కలిసిరావడం లేదు. ఒక పక్క తోటి హీరోలు వరుస సక్సెస్ లతో ఊపు మీద ఉంటే.. నిఖిల్ మాత్రం చేసిన సినిమాని కూడా రిలీజ్ చేసుకోలేక బాక్సాఫీస్ వద్ద వెనుకబడిపోతున్నాడు. గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సిన 'అర్జున్ సురవరం' విడుదల పై ఇంకా క్లారిటీ రాలేదు. మొదట్లో 'ముద్ర' అనే టైటిల్ పెట్టగా వేరే సినిమాతో వివాదమై దాన్ని 'అర్జున్ సురవరం'గా మార్చారు. ఆ తర్వాత మే 1న సినిమా వస్తుందనుకుంటే అది వాయిదాపడింది. ఆ తరవాత కూడా పలుసార్లు తేదీని మార్చారు. కానీ ఇప్పటికీ ఆ సినిమా కష్టాలు తొలగినట్టు కనిపించట్లేదు. మొత్తానికి 'అర్జున్ సురవరం' రిలీజ్ సైరా తరువాతే ఉంటుందని హీరోతో పాటు చిత్రబృందం కూడా చెప్పినా.. విడుదల ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి 'నిఖిల్' కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏమైనా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే నిఖిల్ సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఆశ్చర్యకరమే. నిజానికి నిఖిల్ కి బాగానే హిట్లు వచ్చాయి. నిఖిల్ కి వచ్చిన సక్సెస్ స్థాయికి.. నిఖిల్ వరుస సినిమాల రిలీజ్ లతో బిజీ బిజీగా ఉండాలి.
కానీ ఒక్క హిట్ కూడా లేని హీరో సినిమాల లాగా నిఖిల్ సినిమాలు తయారవుతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడంతా యంగ్ హీరోలదే హవా. కానీ ఆ హవాలో హడావుడి చెయ్యాల్సిన నిఖిల్.. అసలు ఏ మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ - 2 ' సినిమాను చేయడానికి ప్రస్తుతం నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నిఖిల్ సరసన హీరోయిన్ గా శృతి శర్మను ఫైనల్ చేశారట. ఇప్పటికే పుర్తయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. ఎలాగు 'కార్తికేయ' సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో 'కార్తికేయ 2' తీసి... తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి నిఖిల్ కి 'కార్తికేయ 2'నైనా కలిసి వస్తోందేమో చూడాలి.