చిన్నప్పుడే బాల రామాయణం సినిమాతో బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన
ఎన్టీఆర్, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని సినిమాతో
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా ఎంటర్ అవ్వడం జరిగింది. తొలి సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఎన్టీఆర్, ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక అక్కడినుండి మంచి విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ వెల్లువలా ప్రేక్షకాభిమానం సంపాదిస్తూ, ప్రస్తుతం
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం దర్శకధీరుడు
రాజమౌళి దర్శకత్వంలోనో
ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీంగా నటిస్తున్న
ఎన్టీఆర్,
రేపటి
దీపావళి సందర్భంగా తన ఫ్యాన్స్ కు షాకింగ్ గా ఒక
ఖుషి ఖబర్ చెప్పబోతున్నట్లు
టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక నేడు ప్రచారం అవుతున్న వార్తను బట్టి, కొద్దిరోజుల క్రితం
ప్రశాంత్ నీల్ చెప్పిన
కథ నచ్చడంతో ఆ సినిమాకు పచ్చ జండా ఊపిన
ఎన్టీఆర్, ఆ విషయమై రేపు అధికారికంగా ప్రకటన చేయనున్నారని అంటున్నారు. మైత్రి
మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తారని,
అలానే
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ
సినిమా షూటింగ్ ను మే నెలాఖరులో ప్రారంభిస్తారని అంటున్నారు. టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోయిన్ ఇందులో
ఎన్టీఆర్ తో జతకడుతోందని,
అలానే ఒక యువ
సంగీత దర్శకుడు దీనికి స్వరాలు అందిస్తారని టాక్. నిజానికి కొద్దిరోజుల నుండి
ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమాను
మహేష్ తో చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ,
ఎన్టీఆర్ కు ఆయన వినిపించిన
కథ నచ్చడంతో, ఆ
సినిమా పనులు త్వరితగతిన ప్రారంభమయ్యాయని అందుకే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సినిమాను మొదలెట్టాలని దర్శక, నిర్మాతలు సిద్దమయ్యారట. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వస్తేనే కానీ నమ్మలేం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా మరొక రెండు రోజులు గడిస్తేనే కానీ, ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం లేదు....!!