ఇప్పటికే రాబోయే సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఓవైపు
సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, మరోవైపు స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమాలు రెండూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ రాబోయే
సంక్రాంతి కానుకగా ఏకంగా ఒకేరోజున ఒకరిపై మరొకరు పోటీకి సిద్ధం అవుతున్నారు.
మహేష్ వరుసగా
భరత్ అనే నేను,
మహర్షి సినిమాల సూపర్ హిట్స్ తో మంచి ఊపులో ఉండడంతో సరిలేరు నీకెవ్వరు పై ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక బన్నీ మరియు
త్రివిక్రమ్ ల కాంబినేషన్లో గతంలో వచ్చిన జులాయి మరియు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి
సక్సెస్ సాధించడంతో ఈ
సినిమా తప్పకుండా వారిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.
అయితే ప్రమోషన్స్ లో మాత్రం సరిలేరు కంటే అలవైకుంఠపురములో టీమ్ ఒకింత ముందు ఉంది అనే చెప్పాలి. ఇప్పటికే ఈ
సినిమా నుండి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయి శ్రోతల నుండి విశేషమైన స్పందనను రాబట్టడం జరిగింది. మరోవైపు సరిలేరు టీమ్ కూడా అతి త్వరలో పాటలు రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ రెండు సినిమాలతో పాటు
రజినీకాంత్ నటిస్తున్న
దర్బార్, మరియు
కళ్యాణ్ రామ్ మరియు
సతీష్ వేగేశ్నల కాంబోలో తెరకెక్కుతున్న
ఎంతమంచివాడవురా సినిమాలు కూడా
సంక్రాంతి బరిలో నిలవనున్నాయి.
అయితే
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి బాబీ దర్శకత్వంలో నటిస్తన్న
వెంకీ మామ సినిమాను కూడా ఇదే సమయంలో రిలీజ్ చేయాలని భావించి,
మహేష్ మరియు బన్నీల సినిమాలతో పోటీ వద్దనుకుని ఆ
సినిమా సంక్రాంతి రేస్ నుండి ప్రక్కకు తప్పుకున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే నేడు కొన్ని
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం బట్టి,
వెంకీ మామ కూడా
సంక్రాంతి బరిలో నిలవడం పక్కా అని తెలుస్తోంది. ఇక ఈ
సినిమా ఆడియో రైట్స్ ను నేడు ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. మరి రాబోయే
సంక్రాంతి సందర్భంగా జరగబోయే ఈ భీకర బాక్సాఫీస్ పోరులో ఏ
సినిమా ఎంత మేర విజయం ఆదుకుంటుందో చూడాలి....!!