టాలీవుడ్ ఇండస్ట్రీలో యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ‘రన్ రాజా రన్’ సినిమా తో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన యు.వి.క్రియేషన్స్ సంస్థ వారు తర్వాత ప్రభాస్...కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘మిర్చి’ సినిమా నిర్మించి అదిరిపోయే హిట్ అందుకున్నారు. వరుసగా రెండు విజయాలు దక్కడంతో ముఖ్యంగా ప్రభాస్ స్నేహితులు కావడంతో యువి క్రియేషన్స్ వారు ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాని నిర్మించారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అయిన నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకోవడంతో భారీ అంచనాలు మధ్య సినిమా విడుదల కావడంతో రిలీజ్ అయిన మొట్ట మొదటి షోకే దారుణమైన ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

 

దీంతో సోషల్ మీడియాలో ఉన్న ప్రభాస్ అభిమానులు మరి చాలామంది డైరెక్టర్ సుజిత్ పై దారుణమైన కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి ముచ్చటగా మూడోసారి డైరెక్టర్ సుజిత్ తో...యు.వి.క్రియేషన్స్ సంస్థ వారు సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ‘రన్ రాజా రన్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేయాలని...సుజీత్ దర్శకత్వంలో శర్వానంద్ తో సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ మంతనాలు జరుపుతున్నట్లు ఫిలింనగర్లో టాక్ వినపడుతోంది.

 

మొత్తం మీద సాహో సినిమా దారుణంగా ఫ్లాప్ అయినా గాని ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ సుజిత్ ని తీవ్రంగా విమర్శించిన గాని యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మాతలు మాత్రం డైరెక్టర్ సుజిత్ పై ఆయన డైరెక్షన్ పై మంచి నమ్మకం పెట్టుకున్నట్లే అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో రన్ రాజా రన్ సినిమా తరువాత శర్వానంద్ తో ఎటువంటి కథతో సుజిత్ సినిమా చేస్తాడో అన్న ఉత్కంఠత ఇండస్ట్రీలో మరియు ప్రతి ఒక్కరిలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: