గత కొన్ని రోజులుగా తెలుగు నిర్మాతలు మళయాల రీమేక్ రైట్స్ కోసం ఎగబడుతున్నారు. మెగాస్టార్ లుసిఫర్ సినిమా నుండి మొదలుకుని డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియం, హెలెన్, ఇప్పుడు కప్పెలా చిత్ర రీమేక్ హక్కులని దక్కించుకుని మళయాల చిత్రాలపై తమ ఇష్టాన్ని చూపిస్తున్నారు. అయితే పైన చెప్పుకున్న లిస్టులో రెండు సినిమాల రీమేక్ హక్కులని ఒకే బ్యానర్ దక్కించుకుంది.
నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ అయ్యప్పనుమ్ కోషియం ఇంకా కప్పెలా చిత్ర రీమేక్ హక్కులని కొనుక్కుంది. అయ్యప్పనుమ్ కోషియం సినిమాలో రానాతో పాటు రవితేజ కూడా నటిస్తున్నాడట. అయితే కప్పెలా చిత్ర రీమేక్ లో ఫలక్ నుమాదాస్ తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ కనిపించనున్నాడని అంటున్నారు.
ఫలక్ నుమాదాస్ తర్వాత విశ్వక్ సేన్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా మంచి ఫలితం దక్కించుకుంది. అయితే కప్పెలా వంటి రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తే బాగుంటుందని సితార ఎంటర్ టైన్మెంట్స్ భావిస్తోందట. ముహమ్మద ముస్తాఫా తెరకెక్కించిన కప్పెలా మూవీ లాక్డౌన్ కి ముందు థియేటర్లలోకి వచ్చింది.
అయితే లాక్డౌన్ వల్ల ఈ సినిమాకి సరైన గుర్తింపు రాలేదు. కానీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మొన్నటికి మొన్న పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా గురించి ఎంతలా పొగిడాడో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ కి దర్శకుడు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.