ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.
ఇద్దరి తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఓ మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. అచ్చు రాజమణి బాణీలు అందిస్తున్నారు.
షూటింగ్ తొందరగా ఫినిష్ చేసి విడుదల చేస్తామని అంటోంది చిత్రయూనిట్.ఇక అనిల్ మరోసారి తనను స్టార్ డైరెక్టర్ చేసిన సూపర్ స్టార్ మహేష్ కోసం ఓ పర్ఫెక్ట్ కథని సిద్ధం చేసుకొని త్వరలో సినిమా చెయ్యబోతున్నాడని సమాచారం అందుతుంది.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సినిమా సంగతులు తెలుసుకోండి...