చెన్నైలో ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్న నిత్య మంచి జోష్ లో ఉంది. ఆ జోష్ లోనే అర్ధరాత్రి బీచ్ లో తిరుగుతూ పోలీసుల కంట పడ్డింది. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖ పట్టణానికి వచ్చిన నిత్య. అర్ధరాత్రి బీచ్ లో తిరగాలనే కోరిక పుట్టిందంట.. ఇదే విషయాన్ని ఆమె యూనిట్ సభ్యులతో చెపితే అర్ధరారాత్రి సమయంలో బీచ్ కి వెళ్ళడం రిస్క్ అంటూ ఆమెను నిరుత్సహ పరిచారట. అయితే ఎవరు ఎంత చెప్పినా వినకుండి తన మొండి పట్టుదలతో విశిఖ బీచ్ కు అర్దరాత్రి ఒంటరిగా వెళుతున్న నిత్యా మీనన్ కు తోడుగా శర్వానంద్ వెళ్ళాడట. ఇద్దరూ బీచ్ లో వెన్నెలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న నిత్యా శర్వానంద్ లను చూసి ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు వారిద్దరిని గుర్తు పట్టి ఇది మంచి పద్ధతి కాదు అని క్లాసు పీకి జాగ్రత్తగా పంపించి వేసారని టాక్. ఈ వార్తలలో ఎంత నిజమో తెలియక పోయినా నిత్యామీనన్ సరదా శర్వానంద్ కు తలపోటు తెప్పించిందనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: