తెలుగు ఇండస్ట్రీలో తన అందంతో, నటనతో ,అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న హీరోయిన్లలో సమీరా రెడ్డి ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో జై చిరంజీవ ,నరసింహుడు, అశోక్ వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ఈ సినిమాలలో నరసింహుడు, జై చిరంజీవ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలు గా నిలిచాయి ,అశోక్ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఇలా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన సమీరా రెడ్డి, ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో అంతగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. కోలీవుడ్,  బాలీవుడ్  లలోను సమీరా రెడ్డి ఫుల్ రచ్చ చేసింది. అయితే ఆ ఇండస్ట్రీలో మాత్రం సమీరా రెడ్డి విజయాలను సొంతం చేసుకుంది.

 మొత్తానికి సమీరా రెడ్డి చివరగా పెళ్లి చేసుకొని సినిమా కెరియర్ కు గుడ్ బై చెప్పేసింది. ఇది ఇలా ఉంటే సమీరా రెడ్డి తన వయసును దాచుకోవడం లేదు. ఇతర హీరోయిన్లలా రంగులు అద్దుకుంటూ మోసం చేయాలని ప్రయత్నాలు చేయడం లేదు. తన వయసు రిత్యా వస్తోన్న మార్పులను అలానే స్వాగతిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆమె తన జుట్టుకు రంగు కూడా వేసుకోదు. ఇది ఇలా ఉంటే  తాజాగా వీటి గురించే ఓ నెటిజన్ ప్రశ్న సంధించాడు. మీకు 42 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, బాలీవుడ్ లో మీ వాయిస్ ఉన్న హీరోయిన్ ల జుట్టు నల్లగా ఉంది , మీది మాత్రం ఇంత త్వరగా ఎందుకు చల్లబడి పోయింది అంటూ అడిగాడు. దానికి స్పందించిన సమీరా రెడ్డి. వీటిపై నేను నోరు విప్పి మాట్లాడాలి అనుకుంటున్నాను, అప్పుడే ఇలాంటి వాటిలో మార్పులు వస్తాయి, ఎంతో మంది ఆడవాళ్లు వాటిని కవర్ చేస్తారు. కొంతమంది మాత్రం కవర్ చేయరు, ఎవరి ఇష్టం వారిది అంటూ సమీరా రెడ్డి తన స్టైల్ లో సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: