నిత్యా మీనన్..పేరుకి మళయాలి నటి అయినా..చూడటానికి అచ్చంగా తెలుగు అమ్మాయిల కనిపిస్తుంది. తన అధ్బుతమైన నటనతో అటు మళయాలంలోను ఇటు తెలుగులోనూ మంచి ఇమేజ్ సంపాదించుకుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన "అలా మొదలైంది" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ మళయాలి ముద్దుగుమ్మా మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాలో నాని పక్కన ఆమె చేసిన యాక్టింగ్ కు బడా హీరోల నుండి కూడా ప్రశంశలు అందుకుంది.

ఇక ఆ తరువాత వరుస పెట్టి ఇక్కడ సినిమాలను లైన్లో పెట్టింది. బడా హీరోల సినిమాల్లో కూడా చాలా నటించింది.  నిత్యామీనన్ నటించిన అన్నీ  సినిమాల్లో నటిగా తనదైన ముద్ర వేసి..అభిమానుల ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. అభిమానులకు ఈమె ఎంత నచ్చేసిందంటే .. టాలీవుడ్ లోకి మరో సౌందర్య వచ్చింది అని అనిపించుకునేలా చేసింది. మిగతా హీరోయిన్స్ తో పోల్చుకుంటే అందరి కంటే భిన్నంగా మనసుకు నచ్చిన చిత్రాలు మాత్రమే చేస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది నిత్యా మీనన్. నిజానికి అమ్మడు చేసింది కెరియర్ లో తక్కువ సినిమాలే.. అయిన చేసిన ప్రతి సినిమాలో నిత్య తన బ్రాండ్ చూపించింది అని చెప్పాలి. ప్రస్తుతం పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ పక్కన భీంలా నాయక్ అనే సినిమాలో పవన్ కు భార్య నటించింది. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న మన ముందుకు రానుంది.

అలాగే  ‘స్కైలాబ్‌’ అనే చిత్రంలోను నటిస్తుంది నిత్యా. ఇక్కడ విశేషం ఏమిటంటే  ఈ సినిమాతో ఆమె నిర్మాతగా కూడా మారింది. ఇక రీసెంట్ ఇంటర్వ్యుల్లో నిత్యా మాట్లాడుతూ.."నిర్మాతగా ‘స్కైలాబ్‌’ నా మొదటి  సినిమా. నేను డబ్బులు సంపాదించడానికి ఇలా నిర్మాతగా మారలేదు. మంచి కథలను.. నా మనసుకు నచ్చే స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నా. ఆ  ఉద్దేశంతో నే నిర్మాతగా మారాను అంతే. నేను నిర్మాతగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టా" అని నిత్యా మీనన్‌ చెప్పుకొచ్చారు. ఈ ‘స్కైలాబ్‌’ చిత్రంలో నిత్యా మీనన్ తో పాటు  సత్యదేవ్, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రం డిసెంబరు 4న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: