ఈ మధ్య రెమ్యునరేషన్ మాట వింటే డైరెక్టర్స్ కు దిమ్మతిరిగి పోతుంది..ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు మళ్ళీ సినిమాలలొకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.వాళ్ళకు ఉన్న క్రేజ్ వల్ల సినిమాలు హిట్ అవుతాయని డైరెక్టర్స్ కూడా భావిస్తున్నారు. అలా వచ్చిన హీరోయిన్లు అంటే తెలుగులో విజయ శాంతి, టబు..టబు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు.తెలుగులో నాగార్జున సరసన నిన్నే పెళ్లాడతా, వెంకటేశ్ సరసన కూలీ నంబర్ 1 లాంటి బ్లాస్టర్స్‌లో నటించారు. అలాగే, ఆమె కెరీర్‌లో భారీ హిట్ సాధించింది..యువతకు కలరాణిగా మారిందీ అంటే వినీత్ – అబ్బాస్‌లతో కలిసి నటించిన ప్రేమ దేశం. ఈ సినిమాలు టబుకి సౌత్ సినిమా ఇండస్ట్రీలో అసాధారణమైన పాపులారిటీని తెచ్చాయి.


చిరంజీవి సరసన అందరివాడు, బాలకృష్ణ సరసన చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలలో కూడా టబు మంచి పాత్రలు చేశారు. అయితే, టబుకి తెలుగులో కంటే ఎక్కువగా హిందీలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించారు. పక్కా హైదరాబాదీ అయిన కూడా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ కారణంగా ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో అల వైకుంఠపురములో సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పటికీ అదే అందం..అదే క్రేజ్. అందుకే, అల వైకుంఠపురములో సినిమా తర్వాత వరుసగా క్రేజీ చిత్రాలలో నటించే అవకాశాలు టబుకి వచ్చాయట..


అయితే,తెలుగులో సినిమాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. హిందీలోనే సినిమాలు చేస్తే వచ్చే మనిబులిటీ, క్రెడిబులిటీ వేరే లెవల్. ఆ రేమ్యునరేషన్ మన దగ్గర ఇవ్వడం లేదనేదే ఇన్‌సైడ్ టాక్. ఏదేమైనా మన ప్రేక్షకులు టబు తెలుగు సినిమాలు చేస్తే చూడాలనిఆశపడుతున్నారు. కానీ, ఆమె ముంబై వదిలి రావడం లేదు. అంతేకాదు, హిందీలో కూడా టబు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయినా అక్కడ మార్కెట్ పెద్దది. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు.ఇక ఆమె డిమాండ్ నచ్చిన వారికే డేట్స్ ఇస్తుందని టాక్.. మరి తెలుగులో సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: