RRR సినిమా విడుదలైన అనంతరం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని రకాల అవార్డులను గెలుచుకుందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది . ఇప్పటికే మూడు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయితో పాటు రాజమౌళి స్థాయిని కూడా పెంచేస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కి చాలా మంది విదేశీయులు బాగా కనెక్ట్ అయ్యారు. అంతే కాదు నెట్ ఫిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాగా అధిక స్థాయిలో స్ట్రీమింగ్ అయిన మూవీగా రికార్డ్ కూడా క్రియేట్ చేసింది ఈ సినిమా..

దింతో దర్శకుడుగా రాజమౌళి అనేక అంతర్జాతీయ సినిమా వేడుకలుకు ఆహ్వానాలు అందాయి. ఆ సమయంలో చాలామంది మీడియా ప్రతినిధులు ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ గురించి అనేక రకమైన ప్రశ్నలను అడిగారు. అయితే ఈ క్రమంలోనే సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా సీక్వెల్ పై కసరత్తులు జరుగుతున్న తరుణంలో వారం క్రితం ఒక స్టోరీ లాక్ అయిందని అది చాలా గొప్ప ఆలోచనని ప్రస్తుతం దానిని అమలు చేసే తరహాలో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నామని విజయవంతంగా పూర్తి అయితే సీక్వెల్ గురించి మాట్లాడుతాను అని జక్కన్న చెప్పడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.

ఇక ఈ వార్త విన్న మెగా మరియు నందమూరి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. అయితే ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ వస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో విడుదల చేస్తే మొదటి వారానికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవుతాయని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారు. ఇక స్క్రిప్ట్ వర్క్  పూర్తి  కాగానే..వచ్చే ఏడాది స్టార్టింగ్ లోనే ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేస్తామని కృష్ణ గారి బర్త్ డే మే 31 వ తారీకు నాడు సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహేష్ బాబు ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించిన సీక్వెల్ను చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: